మాంసాహారం... తినగానే 'పాలు' తాగొద్దు!

మాంసాహార పదార్థాలు తిన్న వెంటనే పాలు తాగడం మంచిది కాదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అదే విధంగా... అన్ని రకాల మాంసాహారాలను ఒకేసారి తినడం కూడా మంచిది కాదు. ఒకేసారి ఒకేరకమైన మాంసాన్ని తీసుకోవడం ఉత్తమం. ఇక పాలకు, మాంసాహారానికి సంబంధం ఏంటని అంటారా... చూద్దాం... !
మాంసాహార పదార్థాలైన చికెన్, మటన్, చేపలు, రొయ్యల్లో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. పాలలోనూ ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ క్రమంలో మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగడం వల్ల... మన శరీరంలోకి పెద్ద సంఖ్యలో ప్రోటీన్లు చేరుతాయి. ఫలితంగా శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు పేరుకుంటాయి. దీంతో శరీరం యూరిక్ యాసిడ్‌ను సరిగ్గా బయటకు పంపదు. ఫలితంగా... కీళ్లలో యూరిక్ యాసిడ్ పేరుకుపోయి అది క్రిస్టల్స్‌గా మారుతుంది. ఇది గౌట్ తదితర వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక మాంసాహారం తిన్న వెంటనే పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదికాదు.

No comments: